Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలూరి క్రియేషన్స్ పతాకంపై వాయుతనరు, శశి, దేవిప్రసాద్ కీలక పాత్రధారులుగా మోహన్ రావిపాటి దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న చిత్రం 'నేనే ముఖ్యమంత్రి'.
ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరిగింది.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన జీవిత రాజశేఖర్ క్లాప్ నివ్వగా, ఎన్.శంకర్ కెమెరా
స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి తమ్ముడు సత్యం గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ,'సమకాలీన అంశాలతో సాగే పొలిటికల్ డ్రామా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాం. శుక్రవారం నుంచి 15రోజుల పాటు హైదరాబాద్లో షూటింగ్ జరుపుతాం. ఆ తర్వాత కందుకూరు, వైజాగ్ ప్రాంతాల్లో షూటింగ్ చేసేందుకు
ప్లాన్ చేస్తున్నాం. సినిమా షూటింగ్ మొత్తాన్ని 40 రోజుల్లో పూర్తి చేస్తాం' అని చెప్పారు.
'మా చిత్రం ద్వారా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూపించే ప్రయత్నం చేస్తున్నాం.
ఎవరినీ కించపరిచే విధంగా ఈ చిత్రం ఉండదు. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో
కూడా ఇందులోని అంశాలను చర్చిస్తున్నాం' అని నిర్మాత తెలిపారు.
'ఇందులో నేనొక కీలకపాత్రలో నటిస్తున్నాను. కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది. అందుకే
ఇందులో నటించేందుకు అంగీకరించాను' అని దేవి ప్రసాద్ అన్నారు.