Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా కెరీర్లో ఇప్పటివరకు 'రాజీ' లాంటి చిత్రంలో నటించలేదు. అంతేకాదు 'రాజీ' చిత్రంలోని పాత్రనూ పోషించలేదు. మొత్తంగా ఈచిత్రంలో నేను చాలా డిఫరెంట్గా కనిపిస్తాను' అని అంటోంది అలియాభట్. ఈ ఏడాది 'బద్రినాథ్కి దుల్హనియా' చిత్రంతో ప్రేక్షకులను అలరించిన అలియా తాజాగా 'రాజీ'చిత్రంలో నటిస్తోంది. మేఘనా గుల్జర్ దర్శకత్వంలో కరణ్జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి అలియా చెబుతూ,'ఓ వాస్తవ కథ ఆధారంగా పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ తరహా చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. ఇందులో నా పాత్ర కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. ప్రేక్షకులకు పూర్తిగా కొత్తగా కనిపిస్తాను. ఇటువంటి పాత్రలు నటీనటులకు అరుదుగా వస్తుంటాయి. లక్కీగా నాకూ ఇటువంటి అవకాశం రావడం ఆనందంగా ఉంది' అని తెలిపింది.