Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెళ్ళిచూపులు' చిత్రంతో మంచి కమర్షియల్ బ్రేక్నందుకుంది రీతూ వర్మ. ఈ చిత్ర విజయంతో తెలుగు, తమిళంలో భారీ ఆఫర్లను దక్కించుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ సరసన 'ధృవనచ్చథిరమ్' చిత్రంలో నటిస్తున్న ఆమె తాజాగా మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మమ్ముట్టి తనయుడు, 'ఓకే బంగారం'తో తెలుగులోనూ ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్తో నటించే ఛాన్స్ను దక్కించుకుంది. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం దేసింగ్ పెరియస్వామి అనే నూతన దర్శకుడి డైరెక్షన్లో 'కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో దుల్కర్ ఇంజనీర్గా కనిపించబోతున్నారు. ఆయన సరసన కథానాయికగా రీతూని ఫైనలైజ్ చేశారట. ప్రేమతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రీతూ తమిళంలో 'చైనా' అనే మరో చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రీతూ వర్మ ఇకపై మలయాళ ఆడియెన్స్ను కూడా మెస్మరైజ్ చేయాలని కోరుకుందాం.