Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఇంద్రసేన' ఆడియో వేడుకలో డా|| రాజశేఖర్
విజయ్ ఆంటోని, డయానా చంపిక, మహిమ, జ్వువెరీ మేరీ హీరోహీరోయిన్లుగా జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఇంద్రసేన'. ఎన్.కె.ఆర్.ఫిల్మ్స్ పతాకంపై నీలం కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. విజరు ఆంటోని సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్లో జరిగింది. రాజశేఖర్, జీవిత ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, 'విజరు ఆంటోని నటించిన 'బిబ్చగాడు' సినిమా గురించి చాలా విషయాలు విన్నాను. నిజానికి ఆయన నటించిన 'పిచ్చైకారన్' సినిమాను రీమేక్ చేయాలనుకుంటుండగానే సినిమా తెలుగులో అనువాదమై సక్సెస్ సాధించినప్పుడు మంచి సినిమాను వదులుకున్నామనిపించింది. సినిమా చూస్తే ఇంకా బాధపడతానని చూడలేదు. అందులో అమ్మ పాట నాకు బాగా నచ్చుతుంది. దానికోసమైనా 'బిచ్చగాడు'ను తప్పకుండా చూస్తా. 'ఇంద్రసేన' సినిమాను పది నిమిషాలను మాత్రమే చూశా. చాలా బాగా నచ్చేసింది. విజరు ఆంటోనికి, రాధికా, శరత్ కుమార్, నీలం కృష్ణారెడ్డిలకు అభినందనలు. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'మంచి సినిమాలను ప్రోత్సహించి, ఆదరించే ప్రేక్షకుల్లో తెలుగు ఆడియెన్స్ నెంబర్ వన్లో ఉంటారు. ఇంత గొప్ప ప్రేక్షకులను ఎవరినీ చూడలేదు. నాపై ఆదరణ చూపే తెలుగు ఆడియెన్స్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇదొక స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న చిత్రం. ముందుగా ఈ కథ విని శరత్ కుమార్ ఏడ్చారు. డిఫరెంట్ హీరో ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందన్నారు. సినిమా అంతా పాజిటివిటీతో నిండి ఉంటుంది. ఇందులో భాగమైన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్. సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకుకు నచ్చేలా ఉంటుంది' అని రాధికా తెలిపారు. విజరు ఆంటోని చెబుతూ, 'దర్శకుడు శ్రీనివాసన్ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. పదిహేనేండ్ల క్రితం రాధికా నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేశారు. ఇప్పుడూ తమ బ్యానర్లోనే నటించే అవకాశం ఇచ్చినందుకు రాధిక, శరత్కుమార్కి థ్యాంక్స్' అని చెప్పారు. 'నేను ఇక్కడ నిలబడటానికి కారణం విజరు ఆంటోనినే. ఇందులో ఆయన నటించడంతోపాటు సంగీతం కూడా అందించడం విశేషం. భాష్యా శ్రీ సినిమాకు మంచి సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమాకు దర్శకుడినవ్వడం నా అదృష్టం. నా మొదటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా' అని దర్శకుడు జి.శ్రీనివాసన్ తెలిపారు. 'విజరు ఆంటోని నుంచి ఇప్పటికే తెలుగులో రెండు పెద్ద హిట్ చిత్రాలొచ్చాయి. తాజా చిత్రంలో మూడో హిట్ను సాధిస్తారని నమ్మకంగా ఉన్నాం. ఈ నెల 30న సినిమాను గ్రాండ్గా విడుదల చేస్తున్నాం' అని నీలం కృష్ణారెడ్డి తెలిపారు. శరత్ కుమార్ చెబుతూ, 'బ్రదర్ సెంటిమెంట్తో సాగే చిత్రమిది. మంచి ఫీల్ ఉంటుంది. అలాగే అన్ని రకాల వాణిజ్య హంగు లుంటాయి' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవిత, చదలవాడ శ్రీనివాసరావు, డయానా చంపిక, మహిమ, భాష్యశ్రీ పాల్గొన్నారు.