Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఐ ఫోన్తో సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఎంతో ప్లానింగ్తో హార్డ్వర్క్ చేస్తేనే సాధ్యమవుతుంది. అదే సందర్భంలో బడ్జెట్ కంట్రోల్కిది చాలా ఉపయోగపడుతుంది' అని దర్శకుడు ధృవ శేఖర్ అన్నారు. ఐ ఫోన్తో ధృవ శేఖర్ రూపొందించిన 'లవర్స్ క్లబ్' చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో సంభాషించారు.
'చిన్న బడ్జెట్ సినిమాలు చేయాలంటే ఏదో ఒక కొత్తరకమైన అటెన్షన్ ఉండాలి. అలా అనుకున్నప్పుడు ఐఫోన్తో సినిమా చేయాలనుకున్నాం. ఈ ఐడియాతో ఇండిస్టీలోని చాలా మంది నిర్మాతలను కలిశా. ఎవరూ చేయనన్నారు, వర్కౌట్ కాదన్నారు. బడ్జెట్ పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో మా స్నేహితులతో కలిసి 'లవర్స్ క్లబ్' సినిమాకు శ్రీకారం చుట్టాం. షూటింగ్ చేయడానికి ముందు ఐఫోన్ని ఎలా వాడాలి, వాటి ఫీచర్స్, అందులో వచ్చే ఇబ్బందులపై ఆరు నెలల పాటు రీసెర్చ్ చేశా. తర్వాత పక్కా ప్లానింగ్తో సినిమా స్టార్ట్ చేశాం. సినిమా తీయడానికి ఎంతగానో కష్టపడ్డాం. మొత్తానికి మంచి సినిమాను తీశామని నమ్ముతున్నాం. శుక్రవారం విడుదలైన సినిమాకు మంచి స్పందన లభించింది. ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పను కానీ, 9 సినిమాల మధ్యలో విడుదలైన మా చిత్రం మిగతా వాటిని తట్టుకుని నిలబడింది. థియేటర్లో ప్రేక్షకులు రెగ్యులర్ చిత్రాన్ని చూసిన అనుభూతిని పొందుతున్నారు. 'లవర్స్క్లబ్'ను ఢిల్లీలో కొంత మంది రన్ చేస్తున్నట్టు అమీర్ ఖాన్ నిర్వహించిన 'సత్యమేవ జయతే' కార్యక్రమం ద్వారా తెలుసుకున్నా. అలాగే మా క్లాస్మేట్కు సంబంధించి ఓ సంఘటను చూశా. సంపన్న అమ్మాయిని ప్రేమించినందుకు అమ్మాయి కుటుంబసభ్యులు అతన్ని చంపేశారు. సినిమా సెకండాఫ్లో వచ్చే సన్నివేశాలకు ఇదే స్ఫూర్తి. సినిమా స్లోగా కనెక్ట్ అవుతుంది. చాలా మంది బాగుంది, కానీ రాంగ్ టైమింగ్లో విడుదల చేశారంటున్నారు. ఇప్పుడు రిలీజ్ చేయకపోతే ఎప్పటికీ విడుదల చేయలేం. ఇండిస్టీలో థియేటర్లు దొరకడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఈ సినిమా చేసేటప్పుడు, చేశాక చాలా మంది నిర్మాతలు నన్ను అప్రోచ్ అయ్యారు. ఇలాంటి సినిమాలు చేద్దామంటున్నారు. అన్ని సార్లు ఐఫోన్తో చేయలేం. అది చాలా కష్టం. బాలీవుడ్కి చెందిన నిర్మాతలు ఈ టెక్నాలజీని హిందీలో పరిచయం చేద్దామన్నారు. ఆ సినిమాను వచ్చే ఏడాది పట్టాలెక్కించనున్నాం. ఏ సినిమాకైనా హీరో కీలకం. ప్రేక్షకులను థియేటర్కి తప్పించగలిగే కెపాసిటీ హీరోకు మాత్రమే ఉంటుందని ఈ చిత్రం ద్వారా అర్థమైంది. తదుపరి పెద్ద హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాను' అని ధృవశేఖర్ తెలిపారు.