Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తండ్రి, తనయుల అనుబంధం ఇతివృత్తంగా ఉద్వేగభరితమైన కంటెంట్తో రూపొందుతున్న చిత్రమే 'అమ్మాయిలంతే.. అదో టైపు'' అని అంటున్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. గోపీవర్మ, మాళవిక మీనన్, శివాజీరాజా ప్రధాన పాత్రధారులుగా కృష్ణమ్ దర్శకత్వంలో గాయత్రి రీల్స్ పతాకంపై రూపొందుతున్న 'అమ్మాయిలంతే అదో టైపు' చిత్ర ట్రైలర్ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఇటీవల కుటుంబ బంధాలపై వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. అదే కోవలోనే తాజా చిత్రం రాబోతోంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు. 'ఓ తొందరపాటు నిర్ణయం తండ్రీకూతుళ్ళ మధ్య దూరం ఎలా పెంచింది? తండ్రి ప్రేమకు దూరమైన కూతురు అనుభవించే బాధ, ఈ క్రమంలో ఎలాంటి సంఘటనల చోటు చేసుకున్నాయనేదే ఈ చిత్రం. శివాజీరాజా ఇందులో బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఆయన నటన ఆకట్టుకుంటుంది. నవతరం నటీనటుల నటన మెప్పిస్తుంది. భావోద్వేగాలతో సాగే ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ని ఆకట్టుకుంటుంది. చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నాం' అని దర్శక,నిర్మాతలు తెలిపారు.