Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల 'గౌతమ్నంద'తో ప్రేక్షకులను మెప్పించిన గోపీచంద్ తాజాగా 'బలుపు', 'పవర్', 'జై లవకుశ' వంటి చిత్రాలకు స్క్రీన్ప్లే అందించిన కె.చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ చిత్రంలో నటిస్తున్నారు. మెహరీన్ కథానాయిక. శ్రీసత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ నూతన చిత్రం ఆదివారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్నివ్వగా, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మెన్ పి.రామ్మోహన్రావు కెమెరా స్విచాన్ చేశారు. దిల్రాజు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ, 'మా బ్యానర్లో రూపొందుతున్న ఏడవ చిత్రమిది. 'బెంగాల్ టైగర్' చిత్రాన్ని ప్రారంభించిన రామానాయుడు స్టూడియోలోనే ఈ తాజా సినిమాను స్టార్ట్ చేయటం ఆనందంగా ఉంది. ఆ సినిమా విజయం సాధించినట్టుగానే ఈ చిత్రం కూడా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. గోపీసుందర్ సంగీతం, ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ సినిమాకు అసెట్ అవుతాయి. దర్శకుడు కె.చక్రవర్తి నవ్యమైన కథాంశంతో సినిమాను తెరకెక్కించబోతున్నారు. డిసెంబర్ 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం' అని అన్నారు. 'దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన గోపీచంద్, నిర్మాత రాధామోహన్కి కృతజ్ఞతలు. గోపీచంద్ 25వ చిత్రం ఇదే కావడం మరింత సంతోషంగా ఉంది. మరింత బాధ్యతగా ఈ చిత్రాన్ని తీస్తాను' అని దర్శకుడు చెప్పారు. గోపీచంద్ మాట్లాడుతూ, 'చక్రి చెప్పిన కథ బాగా నచ్చింది. మా నాన్నగారి సినిమాలు ఎంత శక్తివంతమైన సందేశంతో ఉండేవో అందరికీ తెలిసిందే. అలాంటి మంచి మెసేజ్తోపాటు కమర్షియల్ ఎలిమెంట్స్తో ఈ సినిమా ఉంటుంది. రాధామోహన్ బ్యానర్లో సినిమా చేయడం హ్యాపీగా ఉంది' అని చెప్పారు. 'నేను నటిస్తున్న 5వ చిత్రం, గోపీచంద్కి 25వ సినిమా కావడం, ఇంత మంచి సినిమాలో నేనూ భాగం అవ్వడం సంతోషంగా ఉంది' అని మెహరీన్ చెప్పారు.