Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్ర ధారులుగా తెరకెక్కుతున్న చిత్రం 'సువర్ణ సుందరి'. సూర్య ఎం.ఎస్.ఎన్ దర్శకత్వంలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎం.ఎల్.లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర హిందీ శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'ఓ వైపు విజువల్ ట్రీట్, మరోపక్క థ్రిల్లింగ్ సబ్జెక్ట్. రెండు అంశాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఓ చారిత్రాత్మక సినిమాను ఫాంటసీగా నిర్మించాలంటే ఆషామాషీ విషయం కాదు. హిస్టారికల్ చిత్రాల సక్సెస్ విషయంలో ఇవే కీలకంగా మారాయి. విజువల్గా, కంటెంట్ పరంగా హై క్వాలిటీ ఉందని ఇటీవల విడుదల చేసిన టీజర్ నిరూపించింది. హిస్టారికల్ అడ్వెంచర్గా దర్శకుడు సూర్య ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. చరిత్ర భవిష్యత్ని వెంటాడుతోందన్న ఆసక్తికర క్యాప్షన్తో, అంతే ఆసక్తికర టీజర్తో ఇప్పుడీ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండిస్టీగా మారింది. విడుదలైన రోజు నుంచే సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ టీజర్ ఒక మిలియన్ డిజిటల్ వ్యూస్ను క్రాస్ చేసింది. ఇక డిజిటల్, శాటిలైట్ రైట్స్ విషయంలో 'సువర్ణ సుందరి' మంచి ఆఫర్స్ను రాబట్టుకుంటోంది. హిందీ శాటిలైట్ రైట్స్ కోటీ రూపాయలకు పైగా పలికింది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్భుతంగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది' అని తెలిపింది.