Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిషా కొఠారి, దేవ్గిల్ ముఖ్య పాత్రల్లో సంపత్రాజ్ దర్శకత్వంలో మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం 'ఓ రావణ లంక'. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి దర్శకుడు సంపత్ రాజ్ మాట్లాడుతూ, 'భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. చాలా రోజుల తర్వాత పూర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేశాను. పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా దేవ్గిల్, నిషా కొఠారి మధ్య క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సినిమాకు ఆకర్షణగా నిలుస్తుంది. నిషా కొఠారి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. కామెడీతోపాటు థ్రిల్ చేసే అంశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి' అని అన్నారు. 'ఇటీవలే చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, జనవరిలో సినిమాను విడుదల చేస్తాం. శీఘ అందించిన సంగీతం హైలైట్ అవుతుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కే ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని నిర్మాత తెలిపారు.