Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే అలియా భట్ గతేడాది 'డియర్ జిందగీ'తో మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది 'బద్రినాథ్ కి దుల్హనియా'తో ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా 'రాజీ' చిత్రంలో భిన్న ప్రధాన పాత్రను పోషిస్తున్న అలియా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'లో నటించనున్నట్టు సమాచారం. 2012లో విడుదలై విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్బస్టర్గా నిలిచిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రానికి ఇది సీక్వెల్గా రాబోతోంది. ఆ చిత్రంలో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్ కలిసి నటించారు. తాజా సీక్వెల్లో టైగర్ షరాఫ్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్ ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు.
ఈ నేపథ్యంలో ఇందులో కథానాయికగా అలియానే తీసుకునే యోచనలో చిత్రబృందం ఉందట. సోమవారం ఈ చిత్ర ఫస్ట్లుక్ను విడుదల చేశారు.
పునిత్ మల్హోత్రా దర్శకత్వంలో కరణ్ జోహర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అలియా దీంతోపాటు షారూఖ్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్.రారు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ అతిథి పాత్రలో మెరవనుంది. ఇందులో కత్రినా కైఫ్, అనుష్క శర్మ కథానాయికలుగా నటిస్తున్న విషయం విదితమే.