Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై డి.సురేష్బాబు సమర్పణలో రాజ్కందుకూరి నిర్మించిన చిత్రం 'మెంటల్ మదిలో'. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కానుంది. సోమవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన విజరు దేవరకొండ మాట్లాడుతూ, 'సినిమాలో మ్యూజిక్ అమేజింగ్. వివేక్ 'పెళ్ళిచూపులు' కంటే ముందు ఓ పొయెటిక్ స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చాడు. అదే ఈ చిత్ర కథ. వివేక్ బెస్ట్ రైటర్. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో నేను, శ్రీవిష్ణు కలిసి చిన్న చిన్న పాత్రల్లో నటించాం. తను చేసే సినిమాలు బాగుంటాయని విన్నాను. ఇప్పుడు కూడా ఈ సినిమా తనకు పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నా' అని అన్నారు. 'దర్శకుడు వివేక్ ముందు 'కావ్యం' పేరుతో ఓ కథ చెప్పారు. అలాంటి సినిమా చేయలేనని చెబితే వారం రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేశాడు. నేను పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే తను రెండు, మూడు సార్లు అడగడంతో సరే రమ్మని కథ విన్నా. స్పెల్ బౌండ్ అయ్యాను. ఇతనే నా నెక్ట్స్ డైరెక్టర్ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టా. తను దర్శకత్వం వహించడంతోపాటు రెండు పాటలు కూడా రాశారు. మంచి టీంతో చేసిన సినిమా ఇది. తరుణ్ భాస్కర్ తర్వాత వివేక్ ఆత్రేయను మా బ్యానర్లో దర్శకుడిగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. నిజాయితీగా మేం చేసిన ఈ అటెంప్ట్కు సపోర్ట్ చేస్తున్న సురేష్బాబుకి థ్యాంక్స్. ఆయన సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వేదరామన్ సినిమాటోగ్రఫీ, ప్రశాంత్ విహారి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతాయి. శ్రీవిష్ణు పెద్దగా మాట్లాడేవాడు కాదు, కానీ బాగా నటించాడు. ప్రీమియర్ చూసిన వాళ్ళందరూ సినిమా బావుందని అన్నారు. పరీక్ష రాసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నాం. మంచి కంటెంట్, హానెస్ట్ అటెంప్ట్ ఉంటే నేను సినిమా చేయడానికి రెడీ' అని రాజ్ కందుకూరి తెలిపారు.
దర్శకుడు వివేక్ ఆత్రేయ చెబుతూ, 'విజరు దేవరకొండ నాన్న వల్ల రాజ్ కందుకూరిని కలిశా. ఈ స్క్రిప్ట్ వినగానే ఆయన నన్ను హగ్ చేసుకోవడంతో నా స్క్రిప్ట్ బావుందని అర్థమైంది. మంచి సినిమా తీశామనే అనుకుంటున్నా. విష్ణు, వివేతా గురించి సినిమా విడుదల తర్వాత అందరు మాట్లాడుకుంటారు' అని చెప్పారు.'యంగ్ టీం చేసిన ప్రయత్నమిది. కథ వినగానే దర్శకుడి వయసెంతో అనుకున్నా. ఇంత యంగ్ ఏజ్లోనే ఇలాంటి సబ్జెక్ట్ చేశాడనిపించింది. టీమ్తో కలిసిపోయి రాజ్ కందుకూరి సినిమా చేశారు. నివేతా పేతురాజ్ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ సినిమా చూశాక.. కె.విశ్వనాథ్గారి కథను తీసుకుని, ఆ కథకు జంధ్యాలగారు మాటలు రాసి దాన్ని చిన్న బడ్జెట్లో మణిరత్నం డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా హాయిగా ఈ సినిమా ఉంటుందనిపించింది' అని శ్రీవిష్ణు తెలిపారు. 'సినిమాలో మంచి పాత్ర పోషించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు థ్యాంక్స్' అని హీరోయిన్ నివేతా పేతురాజ్ అన్నారు.Q