Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లో ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాల జోరు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఇప్పటికే నాగార్జున, నాని కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చారు. వెంకటేష్తో పాటు ఓ యువకథానాయకుడితో మల్టీస్టారర్ చిత్రం చేసేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా మరో యంగ్ మల్టీస్టారర్ పట్టాలెక్క బోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల 'డీజే'తో ఆకట్టుకున్న హరీష్ శంకర్ ఈ కొత్త ప్రాజెక్ట్కు ప్లాన్ చేస్తున్నారు. యువ కథానాయకులు నితిన్, శర్వానంద్ హీరోలుగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ కథను నితిన్, శర్వాకు వినిపించగా ఇద్దరూ ఓకే చెప్పారట. ప్రస్తుతం స్క్రిప్ట్ తుది మెరుగులు దిద్దుకుంటుందని, అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సినిమాను పట్టాలెక్కించాలని చిత్ర బృందం భావిస్తుందట. నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల 'మహానుభావుడు'తో హిట్ అందుకున్న శర్వానంద్ 'అర్జున్రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం.