Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చేయడానికి పని(సినిమాలు)లేనప్పుడు నేనే సొంతంగా వర్క్ని క్రియేట్ చేసుకుంటాను' అని అంటోంది నేహా ధూపియా. 'విలన్', 'పరమవీర చక్ర' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నేహా ఇటీవల 'హిందీ మీడియం', 'తుమ్హారీ సులు' చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ నేపథ్యంలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ, 'ఇన్నేండ్ల కెరీర్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. నా పనిని, కెరీర్ను ఇతరులతో పోల్చుకోను. నచ్చిందే చేస్తాను. సినిమా ఛాన్స్లు అన్నిసార్లు ఉండవు. అలాంటప్పుడు మనమే ఏదైనా చేయాలి. ఇలాంటి సందర్భాలూ నాకూ వచ్చాయి. పని(సినిమాల) కోసం వెళితే ఇక్కడ ఏ పనీలేదన్నారు. దీంతో నాకు నేనుగానే సొంతంగా వర్క్ని క్రియేట్ చేసుకున్నా. కాబట్టి ప్రతి రోజూ మనం అలర్ట్గా ఉండాలి. ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉండాలి' అని తెలిపింది.