Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐశ్వర్యరారు ఉద్వేగానికి లోనయ్యారు. తండ్రి జయంతి రోజున సేవా కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఆమె ఫొటోలు తీసేందుకు వచ్చిన మీడియాను ఫొటోలు తీయో ద్దంటూ కన్నీటి పర్యంత మయ్యారు. ఆ విశేషాలు చూస్తే ఐశ్వర్యరారు తండ్రి కృష్ణారాజ్ రారు జయంతి సోమవారం. ఈ సందర్భంగా ముంబయికి చెందిన స్మైల్ ఫౌండేషన్ ద్వారా గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న వంద మంది చిన్నారులకు సర్జరీ చేయించారు ఐష్. తండ్రి జయంతి సందర్భంగా పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి వారితో కాసేపు సరదాగా గడిపింది. ఆ టైమ్లో ఐష్ ఫొటోలు తీయడానికి గుమిగూడిన మీడియాను చూసి 'ఫొటోలు తీయకండి ప్లీజ్. నేను ఏ పని కోసం ఇక్కడికి వచ్చానో మీకు తెలియదు. ఇది సినిమా ప్రీమియర్ షో కాదు. పబ్లిక్ ఈవెంట్ అస్సలే కాదు. అసలు మీరెందుకిలా ప్రవర్తిస్తున్నారు' అంటూ కన్నీరు పెట్టుకుంది. ఐశ్వర్యరారు తండ్రి కృష్ణారాజ్ అనారోగ్యంతో మార్చి 18న కన్నుమూసిన విషయం విదితమే. ఆయన కూడా గ్రహణం మొర్రితోనే బాధపడే వారట. ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి 2011లో ఆయన గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న వారికి చికిత్స చేయించారు. వారట. ప్రస్తుతం ఐశ్వర్య 'ఫన్నీ ఖాన్' చిత్రంలో నటిస్తోంది.