Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ను దర్శకుడు వినాయక్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన విషయం విదితమే. 'అల్లుడు శీను' పేరుతో వచ్చిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతోపాటు సాయి శ్రీనివాస్కు గుర్తింపు తెచ్చింది. తాజాగా వీరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు వినాయక్. తదుపరి చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారట. నల్లమలపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని పలు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.