Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జోష్' చిత్రంతో పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టిన నాగ చైతన్య తన రెండవ చిత్రం 'ఏం మాయ చేసావె'తో అదిరి పోయే విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. '100%లవ్', 'తడాఖా', 'మనం', 'ఒక లైలా కోసం', 'ప్రేమమ్', 'సాహసం శ్వాసగా సాగిపో', 'రారండోరు వేడుక చూద్దాం' వంటి విజయవంతమైన చిత్రాలతో ఇండిస్టీలో తనకంటూ ఓ మార్క్ను క్రియేట్ చేసుకున్న చైతూ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' చిత్రంలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై వై. నవీన్, వై.రవిశంకర్, మోహన్(సీవీఎం) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంతో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. నేడు(గురువారం) నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా బుధవారం 'సవ్యసాచి' చిత్రంలో చైతూ లుక్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ నెల 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిపాం. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న సెకండ్ షెడ్యూల్ షూటింగ్లో మంగళవారం నుంచి మాధవన్ జాయిన్ అయ్యారు. చైతూతోపాటు నిధి అగర్వాల్, మాధవన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటారు. ఇందులో మాధవన్ పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ మరిచిపోలేని స్థాయిలో ఉంటుంది. ఈ థ్రిల్లర్ చిత్రాన్ని హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్తో రూపొందిస్తున్నాం' అని అన్నారు. 'మైత్రీ మూవీ మేకర్స్లో పనిచేయడం ఆనందంగానూ, ఈ చిత్ర టీమ్తో వర్క్ చేయడం ఎగ్జైటింగ్గానూ ఉంది. అందరం కలిసి అదిరిపోయే సినిమా చేయబోతున్నాం' అని మాధవన్ తెలిపారు.