Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహీదర్, ఇషితా, ప్రశాంత్, లలిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు'. వెంకటేష్ కె.దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్పై శివసాయి సమర్పణలో ప్రశ్నాద్ తాతా నిర్మిస్తున్నారు. నేడు(శుక్రవారం) ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రశ్నాద్ తాతా మాట్లాడుతూ, 'ఇప్పట్లో ప్రతి ఒక్కరు రాముడిలా, సీతలా ఉండాలని కోరుకుంటారు. అదే ఈ చిత్రంలో చూపించాం. ఈ సినిమా ద్వారా ఓ కొత్త విలన్ను తెరకు పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు వస్తోన్న వెజిటేరియన్ సినిమాల మధ్యలో మా సినిమా ఒక నాన్ వెజిటేరియన్గా ఉంటుంది. కథ, కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. అందరిని ఆకట్టుకునే చిత్రమవుతుందని భావిస్తున్నా. ఈ చిత్రానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అని అన్నారు. 'కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమిది' అని దర్శకుడు తెలిపారు. హీరో మహీధర్ చెబుతూ, 'చిత్ర టైటిల్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో, చిత్ర కథాంశం అంతే విభిన్నంగా ఉంటుంది. రొమాంటిక్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో నటించిన మరో హీరో ప్రశాంత్ ఇటీవలే మరణించడం బాధాకరమైన విషయం' అని చెప్పారు.