Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా సినిమాల ద్వారా కనీసం ఓ ఇరవై మందినైనా కొత్తవాళ్ళని చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడమంటే నాకు ఇష్టం. అందులో భాగంగానే 'మెంటల్ మదిలో' చేశాను. మున్ముందు కూడా కొత్తవారితోనే చేస్తాను' అని అంటున్నారు నిర్మాత రాజ్ కందుకూరి. శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన 'మెంటల్ మదిలో' చిత్రం నేడు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి గురువారం మీడియాతో మాట్లాడుతూ, ''పెళ్ళిచూపులు' వంటి జాతీయ అవార్డు చిత్రం తర్వాత నేను నిర్మిస్తున్న సినిమా ఇది. దర్శకుడు వివేక్ మొదట 'కావ్యం' అనే కథ చెప్పాడు. పొయెటిక్గా ఉన్న ఆ సినిమా నేను చేయలేనని చెప్పడంతో వారం రోజుల తర్వాత ఈ కథతో వచ్చాడు. నాకు బాగా నచ్చింది. కన్ఫ్యూజన్ కుర్రాడి కథ అన్నప్పుడే దీనికి శ్రీవిష్ణు సూట్ అవుతాడనిపించింది. ఇందులో ప్రత్యేకంగా కామెడీ అవసరం లేదు. హీరో క్యారెక్టరైజేషన్లోనే కామెడీ ఉంటుంది. అయితే చిన్న చిన్న విషయాల్లో కన్ఫ్యూజన్ ఉంటే ఫర్వాలేదు. సీరియస్ విషయాలు, కెరీర్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా కన్ఫ్యూజన్లో పడితే అతని లైఫ్ ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులకు లోనైంది. దాన్నుంచి బయటపడేందుకు తండ్రి ఏం చేశాడనేది సినిమా.
ఇది డిఫరెంట్గా ఉండే ఓ కళాఖండమని చెప్పను.
నా మనసుకు నచ్చిన కథ. ఇలాంటి సందిగ్ధం ప్రతి ఒక్కరిలోనూ ఏదో టైమ్లో ఉంటుంది. అందుకే ప్రతి కామన్ మ్యాన్ ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారు. 'పెళ్ళిచూపులు' చిత్రంతో లఘు చిత్రం దర్శకుడు తరుణ్ భాస్కర్ను దర్శకుడిగా పరిచయం చేశా. ఈ చిత్రంతో కూడా వివేక్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. వివేక్ చాలా బాగా తెరకెక్కించారు. సినిమాను సురేష్బాబుగారు చూసి ఇంప్రెస్ అయ్యారు. 'మీ టేస్ట్కు తగ్గట్టుగానే సినిమా చేశావ్. ఈ చిత్రాన్ని నేను విడుదల చేస్తాను' అని చెప్పారు. రెగ్యూలర్ సినిమాలు కాకుండా కొత్త తరహాలో సినిమాలు చేయడం నాకిష్టం. అందుకే కొత్తవారిని, ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ను ఎంకరేజ్ చేస్తున్నా. నేను చేసే సినిమాలు రియాలిటికీ దగ్గరగా, మన చుట్టు పక్కల ఇంట్లో కనిపించే పాత్రల్లా ఉంటాయి. హ్యూమన్ ఎమోషన్స్కే ప్రయారిటీ ఇస్తాను. రాజ్ కందుకూరి సినిమా అంటే బ్యాడ్గా ఉండవని, కచ్చితంగా ఫ్యామిలీ అంతా చూసి ఎంజారు చేసేలా ఉంటాయనే మార్క్ ఈ చిత్రంతో ఆడియెన్స్లో పడుతుంది. ప్రస్తుతం రెండు కథలు రెడీగా ఉన్నాయి. కొంత గ్యాప్తో వాటిని తెరకెక్కిస్తా' అని అన్నారు.