Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య, కీర్తి సురేష్ జంటగా నటించిన తమిళ చిత్రాన్ని తెలుగులో 'గ్యాంగ్' పేరుతో యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు తెలుగులో రిలీజ్ చేశారు. సంక్రాంతి సందర్భంగా ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో సూర్య తెలుగునాట విజయయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ, 'సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మా సినిమాకు అద్భుతమైన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. అన్ని వర్గాల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ టేకింగ్, సూర్య నటన, రమ్యకృష్ణ, కార్తీక్ల క్యారెక్టరైజేషన్స్, కీర్తి సురేష్ అందం, మంచి సందేశం, ట్విస్టులు ప్రేక్షకుల్ని ఎంటన్టైన్ చేస్తున్నాయి. సినిమాకు వస్తున్న స్పందన నేపథ్యంలో థియేటర్ల సంఖ్య కూడా పెంచబోతున్నాం. తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు హైదరాబాద్లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేయబోతున్నాం. దీంతోపాటు హీరో సూర్య సక్సెస్ టూర్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటి వరకు తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకుల్ని స్వయంగా పలకరించబోతున్నారు. 'గ్యాంగ్' చిత్రంతో ఇంత మంచి విజయం అందించిన తెలుగు ప్రేక్షకుల్ని అప్యాయంగా కలుసుకోబోతున్నారు' అని అన్నారు.