Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లోనూ రకుల్ప్రీత్ సింగ్కు ఆఫర్ల మీద ఆఫర్లొస్తున్నాయి. ప్రస్తుతం నటిస్తున్న హిందీ చిత్రం 'అయ్యారీ' విడుదల కాకముందే రకుల్ బ్యాక్ టు బ్యాక్ రెండు అవకాశాలను అందిపుచ్చుకోవడం ఓ విశేషమైతే, ఈ రెండు ప్రాజెక్ట్లు కూడా బాలీవుడ్ స్టార్ హీరోలతో కావడం మరో విశేషం. ఇటీవల అక్షరుకుమార్ సరసన ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించిన రకుల్ తాజాగా అజరుదేవగన్కి జోడీగా నటించబోతోంది. ఈ నయా చిత్రం గురించి రచయిత, నిర్మాత రంజన్ మాట్లాడుతూ,'అర్బన్ రిలేషన్షిప్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం.
ఇందులో అర్బన్ గర్ల్గా రకుల్ నటించనుంది. ఈ కథను ప్రిపేర్ చేసినప్పుడే కథానాయికగా రకుల్ని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే ఆమె నిజ జీవితంలోనూ ఈ కథలోని పాత్రకు అనుగుణంగా ఉంటుంది.
ఆమె బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఈ పాత్రకు సూట్ అవుతుంది. ఈ పాత్రలో రకుల్ని తప్ప మరొకరిని ఊహించలేం. అజరుగేవగన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈచిత్రానికి అకీవ్ ఆలీ దర్శకత్వం వహిస్తున్నారు. టీ-సిరీస్, లవ్ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు. రకుల్ ఈ చిత్రంతోపాటు తమిళంలో సూర్య సరసన ఓ చిత్రంలోను, కార్తీకి జోడీగా మరో చిత్రంలోనూ నటిస్తోంది. తెలుగులో మహేష్, వంశీపైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంతోపాటు నితిన్, శర్వానంద్ హీరోలుగా హరీష్శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే 'దాగుడుమూతలు' చిత్రంలోనూ రకుల్ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.