Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెడ్ యాంట్స్ పతాకంపై ప్రశాంత్కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మిఠాయి'. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు విజరుదేవరకొండ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'ఈ సినిమాకు పని చేస్తున్న యూనిట్ అంతా నాకు 'పెళ్ళిచూపులు' చిత్రం దగ్గర్నుంచి పరిచయమే. ప్రశాంత్ నాకు మంచి స్నేహితుడు. డార్క్ కామెడీ సినిమా అనగానే చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాను. టీమ్కు ఆల్ ద బెస్ట్' అని చెప్పారు. 'మంచి కథ, కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఈ చిత్రం ఉంటుంది' అని రాహుల్ రామకృష్ణ తెలిపారు. 'డార్క్ కామెడీ నేపథ్యంలో మన దగ్గర చాలా తక్కువ సినిమాలొచ్చాయి. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది' అని దర్శక, నిర్మాత ప్రశాంత్కుమార్ చెప్పారు. గాయత్రిగుప్తా, శ్వేతా వర్మ, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, భూషణ్ కళ్యాణ్, కమల్ కామరాజు, రవివర్మ, అజరుఘోష్, విజరు మురార్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం : వివేక్సాగర్, సినిమాటోగ్రఫీ : సాకేత్ సౌరభ్, ఎడిటింగ్ : వీణు భూషణ్, కొరియోగ్రఫీ : అనీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కృష్ణ వొడపల్లి.