Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సి.వి.ఎం) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను ఈనెల 24న విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఓ పోస్టర్ను విడుదల చేసింది. ''శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత మా బ్యానర్లో రూపొందుతున్న ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ ఇది. మెగా పవర్స్టార్ రామచరణ్ లుక్తో రిలీజ్ చేసిన సినిమా ఫస్ట్లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. చిట్టిబాబు పాత్రలో రామ్చరణ్ మాస్ యాక్టింగ్, సమంత గ్లామర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. విలక్షణమైన కథలు, క్యారెక్టరైజేషన్స్ను తెరపై ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలే ఆయనేంటో నిరూపించాయి. మరోసారి తనదైన స్టయిల్లో విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. రామ్చరణ్, సమంత ఇంతకముందెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద అసెట్ అవుతాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను వచ్చే ఏడాది మార్చి 30న సమ్మర్ స్పెషల్గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇది మా బ్యానర్ వ్యాల్యూస్ను పెంచడమే కాకుండా మా సంస్థకు హ్యాట్రిక్ హిట్ అందించే సినిమా అవుతుంది' అని చిత్రబృందం తెలిపింది. జగపతిబాబు, ప్రకాష్రాజ్, సీనియర్ నరేష్,ఆది పినిశెట్టి, అనసూయ ఇతర పాత్రలు పోషించిన ఈచిత్రానికి ఎడిటింగ్: నవీన్నూలి.