Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్చరణ్ నుంచి గతేడాది ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ లోటును ఈ ఏడాది భర్తీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఆయన సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించబోయే సినిమాను త్వరలోనే ప్రారంభించ బోతున్నారు. ఇప్పటికే ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను ఈ నెల 19 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నారు. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా ఉండబోదంటూ పలు వార్తలు గతంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న నేపథ్యంలో బోయపాటి దర్శకత్వంలో నటించే సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని అనుకున్నారు. వీటికి భిన్నంగా బోయపాటి సినిమా తర్వాతే రాజమౌళి సినిమా ఉంటుందని తెలుస్తోంది. తారక్తో రామ్చరణ్ నటించే మల్టీస్టారర్కు 'ఇద్దరూ ఇద్దరే' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న 'రంగస్థలం'లో సమంత కథానాయికగా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది.