Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న చిత్రం 'ఛలో'. ఈ చిత్ర ట్రైలర్ గురువారం విడుదలైంది. ఇందులో 'నిన్న రాత్రి రజనీకాంత్ నటించిన 'భాషా' చూశాను. ఎంత చేసినా ఆయన తెలుగులో చేసినంత ఈజ్తో తమిళంలో చేయలేకపోయారు' అని వైవా హర్ష చెప్పిన డైలాగ్, తెలుగోళ్ల మీద నీ ఒపీనియన్ ఏంట్రా అన్న ప్రశ్నకు 'పాపం మంచోళ్లేరా.. వాళ్లే కదా 'బాహుబలి' తీసింది' అని హాస్యనటుడు సత్య చెప్పిన డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఫస్ట్లుక్, టీజర్, సాంగ్స్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. తాజాగా విడుదలైన ట్రైలర్కు అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ నెల 25న ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని విధంగా చాలా గ్రాండ్గా నిర్వహించబోతున్నాం. ఈ వేడుకకు చిరంజీవి గెస్ట్గా విచ్చేస్తున్నారు. మహతి స్వర సాగర్ అందించిన పాటలు అద్భుతంగా వచ్చాయి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. అద్భుతమైన విజువల్స్ అందించారు. నాగశౌర్య నటన చాలా కొత్తగా, ఎనర్జిటిక్గా ఉంటుంది. తన కెరీర్లో పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీగా నిలుస్తుందని నమ్ముతున్నాను. నాగశౌర్య, రష్మిక మండన్న మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరి 2న సినిమాను విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమాగా నిలుస్తుంది' అని అన్నారు. నరేష్, పోసాని, రఘుబాబు, వెన్నెల కిషోర్, మైమ్ గోపీ, ప్రవీణ్, సత్య, వైవా హర్ష, వేణుగోపాలరావు, మెట్ట రాజేంద్రన్, ప్రగతి, స్వప్పి, సుదర్శన్, జీవా ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రామ్ అరసవిల్లి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు.