Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమాల్లో ప్రత్యేక గీతాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అవి మాస్ ఆడియెన్స్ను ఊర్రూతలూగించడంతోపాటు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. అందుకే స్టార్ హీరోలు తమ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. మహేష్బాబు నటించిన 'పోకిరి', 'దూకుడు', 'ఆగడు' చిత్రాల్లోనూ ఈ పాటలున్నప్పటికీ ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'భరత్ అనే నేను' చిత్రంలో మాత్రం ప్రత్యేక గీతానికి నో అని చెప్పారట. కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. ఇది రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సెకండాఫ్లో స్పెషల్ సాంగ్ ఉంటే ఫ్లో డిస్ట్రబ్ అవుతుందని మహేష్ భావించారట. అందుకే ఈ సినిమాలో ఎలాంటి ప్రత్యేక గీతాలు ఉండబోవని తెలుస్తోంది. మహేష్బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న ఈచిత్ర క్లయిమాక్స్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు, రెండు ఫైట్లు మినహా చిత్రీకరణ పూర్తయ్యిందట. మహేష్ సరసన కైరా అద్వాని కథానాయికగా నటిస్తున్న ఈచిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్ర టీజర్ను విడుదల చేయబోతున్నారు. అలాగే ఏప్రిల్ 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమాలో నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది.