Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్లో నటించేందుకు మూడేండ్ల క్రితమే ఓ స్క్రిప్ట్కు ఓకే చెప్పినట్టు ఇటీవల ప్రభాస్ తెలిపిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించే కథానాయిక ఎవరన్నదిప్పుడు హాట్టాపిక్ అయ్యింది. నిన్నటి వరకు దీపికా పదుకొనె పేరు వినిపించింది. అయితే తాజాగా దీపికా స్థానంలో కత్రీనా కైఫ్ పేరు తెరపైకి వచ్చింది. నిర్మాత కరణ్ జోహర్ ప్రస్తుతం కత్రీనాతో ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుపుతున్నారట. అలాగే అలియా భట్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
'సాహో' చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ కథానాయిక శ్రద్ధాకపూర్ నటిస్తోంది.