Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల యూసఫ్జారు జీవితం ఆధారంగా 'గుల్ మకై' చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే. అంజాద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రకీరణ కాశ్మీర్లో జరుపుకుంటోంది. ఆ విశేషాలను దర్శకుడు అంజాద్ ఖాన్ తెలియజేస్తూ, 'మలాల జీవిత ప్రయాణాన్ని తెలిపే చిత్రమిది. పుట్టినప్పట్నుంచి నోబెల్ బహుమతి అందుకునేంత వరకు ఆమె ఎదుర్కోన్న సవాళ్ళు, స్పిరిట్, తాలిబన్ టెర్రరిస్టుల దాడిని ఎదుర్కొని నిలిచిన వైనం, బాల విద్యకు ఆమె చేస్తున్న సేవ వంటి అంశాలను స్ఫూర్తివంతంగా తెరకెక్కిస్తున్నాం. సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ను భుజ్, ముంబయిలో చిత్రీకరించాం. ప్రస్తుతం కాశ్మీర్లో చివరి షెడ్యూల్ను జరుపుతున్నాం' అని అన్నారు. ఇందులో రీమ షైఖ్, దివ్యా దత్, ముఖేష్ రుషి, అభిమన్యు సింగ్, అజాజ్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.