Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుష్క ప్రధాన పాత్రధారిణిగా 'భాగమతి' చిత్రంలో నటిస్తున్నారు. అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. ఈ నెల 26న విడుదల కాబోతున్న ఈ సినిమాలోని 'మందారా.. మందారా.. కరిగే తెల్లారేలా..' అనే పాటను విడుదల చేశారు. పాటకు మంచి స్పందన వస్తున్న సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ''బాహుబలి'తో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేసింది. ఇప్పుడు మంచి మెలోడీ సాంగ్ను విడుదల చేశాం. ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
అనుష్క, ఉన్నిముకుందన్ మీద చిత్రీకరించిన ఈ ప్లెజెంట్ సాంగ్ యూత్ని ఫిదా చేయడంతోపాటు
శ్రోతలనూ మెస్మరైజ్ చేస్తోంది. ఈ పాటకు శ్రీజో సాహిత్యం అందించగా, ఎస్.ఎస్.థమన్ మంచి మెలోడీ ట్యూన్ను స్వరపరిచారు. శ్రేయా ఘోషల్ అంతే మధురమైన గొంతులో ఆలపించి పాటకు ప్రాణం పోశారు. సినిమాలో అనుష్క నటన, దర్శకుడు అశోక్ టేకింగ్, మథి కెమెరా వర్క్, అబ్బుర పరిచే రవీందర్ ఆర్ట్ వర్క్, థమన్ రీరికార్డింగ్, యువి క్రియేషన్ నిర్మాణ విలువలు హై స్టాండర్ట్స్లో ఉంటాయి. ఈ సినిమాకున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం' అని అన్నారు.