Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్పాండే, రవికాలే ప్రధాన పాత్రధారులుగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దండుపాళ్యం 3'. ఈచిత్రాన్ని సాయికృష్ణ ఫిల్మ్స్ సమర్పణలో వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మీసాల, రజని తాళ్లూరి సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'విభిన్నమైన కథాంశంతో సహజమైన సన్నివేశాలతో, భావోద్వేగపరమైన నటనతో 'దండుపాళ్యం' చిత్రాలు ఆకట్టుకుంటున్న విషయం విదితమే. అందులో భాగంగా మూడవ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇదే ఈ సిరీస్కి చివరి చిత్రం. అద్భుతమైన కథ, కథనంతో దర్శకుడు శ్రీనివాసరాజు సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించారు. సన్నివేశాలు ఆడియెన్స్ను మెస్మరైజ్ చేస్తాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. 'దండుపాళ్యం' సిరీస్కి ఇదే చివరి సినిమా కావడంతో క్లైమాక్స్ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అందుకే ట్రేడ్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ నెల 25న గ్రాండ్గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించి, మార్చి 2న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్యా, సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్, ఎడిటింగ్: రవిచంద్రన్.