Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ఏడాది ఇప్పటివరకు 'టచ్ చేసి చూడు', 'తొలిప్రేమ' వంటి బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలతో రాశీఖన్నా ప్రేక్షకులను అలరించింది. అందులో రవితేజ సరసన నటించిన 'టచ్ చేసి చూడు' అపజయాన్ని చవిచూడగా, 'తొలిప్రేమ' మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు ఈ చిత్రంలోని రాశీ నటనకు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు. రాశీ ఇప్పటివరకు చాలా చిత్రాల్లో నటించినప్పటికీ ఈ చిత్రంలోని పాత్ర మాత్రం అందర్నీ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రాశీ తాజాగా ఓ తెలుగు చిత్రంలో నటించేందుకు పచ్చజెండా ఊపిందని సమాచారం.
తొలిసారి నితిన్కి జోడీగా 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంలో రాశీ నటించనుందట. సతీష్ వేగేష్ దర్శకుడు.
దిల్ రాజు నిర్మించే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు చోటుండటంతో మరో హీరోయిన్గా నందిత శ్వేతను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందబోయే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. నితిన్ ప్రస్తుతం 'ఛల్ మోహన్రంగ' చిత్రంలో నటిస్తుండగా, రాశీఖన్నా తమిళంలో 'సైతాన్ కా బచ్చా', 'ఇమైక్కా నోడిగల్', 'అగంగా మరు' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.