Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రజనీకాంత్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం '2.0'. 'రోబో' తర్వాత శంకర్,
రజనీ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తుండగా, అక్షరు కుమార్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మొదట జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. వాయిదా వేసి తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఏప్రిల్లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. తాజాగా మరోసారి సినిమా విడుదలను వాయిదా వేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందని సమాచారం. అందుకు కారణం సీజీ, వీఎఫ్ఎక్స్ ఆలస్యమవడమే. ఈ చిత్ర వీఎఫ్ఎక్స్ పనులను అమెరికాకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ దివాలా తీయడంతోపాటు ఇప్పటి వరకు చేసిన సీజీ వర్క్ విషయంలో కూడా దర్శకుడు శంకర్ సంతృప్తిగా లేరట. దీంతో త్రీడీ ఎఫెక్ట్స్తో సహా మొత్తం వీఎఫ్ఎక్స్ పనులు మళ్ళీ మొదట్నుంచి ప్రారంభించాలనే యోచనలో శంకర్ ఉన్నారట. దీంతో ఓ కొత్త సంస్థకు ఈ సీజీ పనులను అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్ కూడా విడుదల చేయలేదు. అన్ని పనులు పూర్తి చేసిన తర్వాతే టీజర్, ట్రైలర్తో సహా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారట. రెహ్మాన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఇటీవల దుబారులో విడుదల చేసిన విషయం విదితమే. '2.0' వాయిదా పడుతున్న నేపథ్యంలో రజనీకాంత్ నటించిన మరో చిత్రం 'కాలా'ను ఏప్రిల్లో తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'కబాలి' వంటి బ్లాక్ బస్టర్ను అందించిన పా.రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.