Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లెజెండరీ సింగర్ ఆశాభోంస్లేకు అత్యంత ప్రతిష్టాత్మకమైన యశ్చోప్రా మెమొరియల్ జాతీయ అవార్డును అందజేశారు. 2018 సంవత్సరానికిగానూ టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ అందజేసే ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం ముంబయిలో అత్యంత వైభవంగా జరిగింది. ఆశాభోంస్లేకు అతిథిగా విచ్చేసిన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో అలనాటి మేటినటి రేఖ, జయప్రద, పరిణీతి చోప్రా, పూనమ్ దిల్లాన్, జాకీ షరాఫ్ పాల్గొని ఆశా భోంస్లేకు అభినందనలు తెలిపారు. అంతేకాదు ఆమెతో తమకున్న అనుబంధాన్ని ఆహుతులతో పంచుకున్నారు.
ఏడు దశాబ్దాల సుదీర్ఘ సినీ సంగీత ప్రస్థానంలో ఆశాభోంస్లే ఇప్పటి వరకు 20 భాషల్లో 11వేల
పాటలు పాడి శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. యశ్చోప్రా జ్ఞాపకార్థం 2012లో టి.సుబ్బరామిరెడ్డి, అను రంజన్, శశి రంజన్ కలిసి ఈ అవార్డును స్థాపించారు. ఇప్పటి వరకు
లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారూఖ్ఖాన్లకు అందజేశారు. 5వ పురస్కార గ్రహీతగా ఆశాభోంస్లే ఎంపికయ్యారు. ఈ అవార్డుతోపాటు పది లక్షల రూపాయల నగదును ఆశాకు అందజేశారు.