Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన నటీనటులతో గణేష్రాజ్ దర్శకత్వంలో రూపొంది ఘన విజయం సాధించిన మలయాళ చిత్రం 'ఆనందం'. ఈ చిత్రాన్ని అదే పేరుతో సుఖీభవ మూవీస్ పతాకంపై ఎత్తరి గురురాజ్ తెలుగులో విడుదల చేస్తున్నారు. వీర వెంకటేశ్వర రావు (పెదబాబు), వీఆర్బీ రాజు, రవివర్మ చిలువూరి సహనిర్మాతలు. ఆర్.సీతారామరాజు సమర్పకులు. ఈ చిత్రం గురించి నిర్మాత ఎత్తరి గురురాజ్ మాట్లాడుతూ, 'కాలేజ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రూ.4కోట్లతో తెరకెక్కి రూ.20కోట్లు వసూలు చేసింది. ఆహ్లాదకరమైన కథతో, భారీ విజయంతో యువ హృదయాలను కొల్లగొట్టిన ఈ మలయాళ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో మాలీవుడ్ టాప్ హీరో నివిన్ పాల్ అతిథి పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్ర రీమేక్ కోసం ఓ పెద్ద సంస్థ ఫ్యాన్సీ రేట్ను ఆఫర్ చేసింది. కానీ తెలుగు నేటివిటీకి సరిపోయే అంశాలు ఇందులో పుష్కలంగా ఉండటంతో అనువాదం చేసి విడుదల చేయాలనుకుంటున్నాం. సినిమా అంతా చాలా నేచురల్గా సాగుతుంది. ఎక్కడా ఓవర్ డ్రామా, మెలో డ్రామా, సినిమాటిక్ డ్రామా కనిపించదు. తప్పకుండా యువతను ఆకట్టుకుంటుంది. ఇండిస్టీయల్ టూర్లో భాగంగా నాలుగు రోజుల్లో ఏం జరిగిందనేది సినిమాలో ఆసక్తికరం. మూడు లవ్ స్టోరీలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మలయాళ అగ్ర సంగీత దర్శకుడు సచిన్ వారియర్ వినసొంపైన సంగీతాన్ని అందించారు. వినేకొద్దీ వినాలపించేలా పాటలుంటాయి. మార్చి మొదటి వారంలో పాటలను, 16న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇది 'హ్యాపీడేస్'ను మరిపించే చిత్రమవుతుంది' అని అన్నారు. అరుణ్ కురియన్, థామస్ మాథ్యూ, రోషన్ మాథ్యూ, విశాక్ నాయర్, సిద్ధి మహాజన కట్టి, అన్ను ఆంటోని, అనార్కళి మరికర్, రెంజి ఫణిక్కర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్.ఇ.చంద్రన్.