Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నటన పరంగా అనుష్క, సాయిపల్లవి అంటే ఇష్టం. వారిలా మహిళలకు ప్రాధాన్యత
ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నా' అని అంటోంది పాలక్ లల్వాని.
రంజిత్, పాలక్ లల్వాని జంటగా త్రికోటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జువ్వ'.
ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా పాలక్ లల్వాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ, 'నా మొదటి సినిమా 'అమ్మాయితో అబ్బాయి' చూసి దర్శకుడు త్రికోటి ఈ చిత్రానికి ఎంపిక చేశారు. యాక్షన్ ప్రధానంగా సాగే కమర్షియల్ చిత్రమిది. లవ్ స్టోరీకీ ప్రాధాన్యత ఉంటుంది. 'జువ్వ' లాగే రాకెట్లా సినిమా కూడా దూసుకుపోతుంది. నేను ఈజీ గోయింగ్ గర్ల్గా కనిపిస్తాను.
రంజిత్తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. సినిమా పూర్తయ్యేలోపు నటుడిగా మంచి పరిణతి సాధించాడు. సినిమా బాగా రావడానికి దర్శకుడు త్రికోటినే కారణం. రాజీపడకుండా ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకున్నారు. మాకు ప్రతిదీ చేసి చూపించేవారు. సినిమా బాగా వచ్చింది. నాకు అనుష్క, సాయిపల్లవి అంటే స్ఫూర్తి. వారిలా సినిమాలు చేయాలనుకుంటున్నా. శక్తివంతమైన మహిళా పాత్రలు, మహిళా సాధికారతకు సంబంధించిన పాత్రలు చేయడం ఇష్టం. కానీ ఇప్పుడు అలాంటి పాత్రలు రావు. కాబట్టి దర్శకులపై నమ్మకంతో నచ్చిన సినిమాలు చేస్తా. ఇక నా ఫేవరేట్ హీరో మాత్రం మహేష్బాబు. ఆయనతో సినిమా ఎప్పుడు అని సోషల్ మీడియాలో అడుగుతుంటే చాలా సంతోషంగా ఉంది. సైకాలజీ అండ్ ఫిలాసఫీలో గ్రాడ్యూయేట్ చేస్తున్నాను. అలాగే ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నాను' అని చెప్పారు.