Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రేమమ్', 'శతమానం భవతి', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాలతో ఆకట్టుకున్న అనుపమా పరమేశ్వరన్ తాజాగా సాయిధరమ్ తేజ్తో కలిసి ఓ నూతన చిత్రంలో నటిస్తోంది. కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఆదివారం అనుపమా పరమేశ్వరన్, రామారావు తనయుడు కె.ఎ.వల్లభ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎఫ్ఎన్సీసీలో వీరి బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుపమా మాట్లాడుతూ, 'నేను ఇంత గ్రాండ్గా బర్త్డే జరుపుకోవడం ఇదే తొలిసారి. నిర్మాత కె.ఎస్.రామారావు, సాయిధరమ్ తేజ్, చిత్ర యూనిట్కు కృతజ్ఞతలు' అని అన్నారు. 'అనుపమా పరమేశ్వరన్ పుట్టిన రోజుని అందరి సమక్షంలో సెలబ్రేట్ చేయడం ఆనందంగా ఉంది. తను మంచి నటి. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. తను ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలి. సాయిధరమ్ తేజ్, అనుపమ జంటగా మా బ్యానర్లో ఓ అందమైన ప్రేమ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. తాజాగా జరుగుతున్న షెడ్యూల్ ఏప్రిల్ 20 వరకు నాన్స్టాప్గా జరుగనుంది. అన్ని వర్గాలను అలరించే చిత్రమవుతుంది' అని కె.ఎస్.రామరావు అన్నారు.