Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సంగీతం, సాహిత్యం మీద అభిమానంతో కాకుండా సినీ పరిశ్రమను ఓ దేవాలయంగా భావించి ఇప్పటి వరకు సినిమాలు చేశాను. నా నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను' అని కళాతపస్వీ కె.విశ్వనాథ్ అన్నారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సువర్ణ భూమి ఆధ్వర్యంలో కె.విశ్వనాథ్ పుట్టిన రోజు వేడుకలు సోమవారం హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ రోజు నా పుట్టిన రోజు వేడుకను ఇంత ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ప్రతీ దేవాలయంలో అర్చక స్వాములుంటారు. వాళ్ళలో ఒకరికే దేవుడికి ప్రసాదం వడ్డించే అవకాశం కలుగుతుంది. అలా దేవాలయం లాంటి సినిమా కళలో నేను చేసే వంటను ముందుగా ప్రేక్షకులకు అందించే అదృష్టం కలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది' అని అన్నారు. 'సువర్ణభూమి వారు మా గురువు విశ్వనాథ్ పుట్టిన రోజుతోపాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం విశేషం. ఆయనకు సన్మానాలు కొత్త కాదు. ఇలాంటి సేవా కార్యక్రమాల వల్ల ఆయనెంతో సంతోషపడతారు. ఇండ్రస్టీలో టాప్ 10 సినిమాలు ఆయనవే ఉంటాయి. ఆ తర్వాతే ఎవరివైనా. అంత మంచి సినిమాలను మనకు అందించారు' అని 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో బెనర్జీ, ఏడిద శ్రీరామ్, సురేష్ కొండేటి, ఉత్తేజ్, జయలక్ష్మి, సువర్ణభూమి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప్తీ బొలినేని తదితరులు పాల్గొని విశ్వనాథ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.