Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఒకప్పుడు హీరోలు మాత్రమే యాక్షన్ చేస్తే చూసేవారు. కథానాయికలను సినిమాకు డిజైన్ చేసిన ఫ్లవర్స్లా చేసేవారు. కానీ ఇప్పుడు ఆడియెన్స్లో మార్పు వస్తోంది' అని అంటోంది సోనాక్షి సిన్హా.
సినిమాల్లో హీరోయిజం గురించి చెబుతూ, 'ప్రేక్షకుల్లో ఇప్పుడు పాజిటివ్ ఛేంజ్ కనిపిస్తుంది. గతంలో హీరోలు చేసే హీరోగిరిని మాత్రమే చూసేవారు. మహిళలను గ్లామర్ పాత్రలకే పరిమితం చేసేవారు. ఇప్పుడు ఆడియెన్స్ చాలా ఓపెన్ అవుతున్నారు. హీరోయిన్లూ హీరోల్లా విరోచితంగా పోరాటం చేసినా చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. దర్శకులు కూడా హీరోలతో సమానంగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు' అని తెలిపింది.