Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సాక్ష్యం'. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని తాజాగా ప్రకటించారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'ఇటీవల విడుదలైన టైటిల్ లోగో, ప్రేమికుల రోజున రిలీజైన హీరోహీరోయిన్ల ఫస్ట్లుక్కు విశేషమైన స్పందన లభించింది. శ్రీవాస్ డైరెక్షన్ స్కిల్స్, స్క్రిప్ట్ ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తాయి. ప్రతి సన్నివేశాన్ని అత్యద్భుతంగా మలుస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా ఉంటుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇమేజ్కి మంచి మేకోవర్ ఇచ్చే చిత్రమిది. డూప్ లేకుండా యాక్షన్ సీన్స్, పూజా హెగ్డేతో రొమాంటిక్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. నిర్మాణ పరంగా ఎక్కడ రాజీపడకుండా భారీ బడ్జెట్తో నిర్మాత అభిషేక్ నిర్మిస్తున్నారు. ఆర్ఎఫ్సీలో జరిగే తాజా షెడ్యూల్ పూర్తవగానే చివరి షెడ్యూల్ కోసం అమెరికా వెళ్ళనున్నారు. అమెరికాలో చిత్రీకరించే కీలక సన్నివేశాలతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వేసవి కానుకగా సినిమాను మే 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కచ్చితంగా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు' అని తెలిపింది.