Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ సినిమా సెల్ ఆధ్వర్యంలో, ప్రముఖ నటుడు సీవీఎల్ నర్సింహరావు అధ్యక్షతన జరిగిన
ఓ కార్యక్రమంలో దర్శక, నిర్మాత ప్రభాకర్ జైనీకి తెలంగాణ సినీ స్వర్ణకమలం అవార్డును బహూకరించారు. ఈ సందర్భంగా నర్సింహరావు చెబుతూ, 'గత శతాబ్దంలో వచ్చిన వంద గొప్ప నవలల్లో ఒకటైన 'అంపశయ్య' వంటి మనోవైజ్ఞానిక నవలను సినిమాగా తీయడం ఓ సాహసం. సెల్యులాయిడ్పై అద్భుతమైన సుందర దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించిన డా||ప్రభాకర్ జైనీ ఈ సినిమాలో తన భార్య విజయలక్ష్మీతో కలిసి నటించారు. అందులో వారి నటన కన్నీరు పెట్టిస్తుంది' అని చెప్పారు. అవార్డు రావడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రభాకర్ జైనీ
సంతోషం వ్యక్తం చేశారు.