Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రాలకు తెరలేపిన సినిమా 'మనం'. అంతేకాదు ట్రెండ్ సెట్టర్గానూ నిలిచిన సినిమా. ఆ తర్వాత ఈ తరహాలో సినిమాలు రాలేదు. తాజాగా నందమూరి హీరోలు కలిసి ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న నందమూరి కళ్యాణ్రామ్ ప్రస్తుతం 'ఎమ్మెల్యే', 'నా నువ్వే' చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో ఆయన పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చారట. ఇందులో కళ్యాణ్రామ్తోపాటు ఎన్టీఆర్, హరికృష్ణ కూడా నటించనున్నారని సమాచారం. అయితే ఎన్టీఆర్, హరికృష్ణ పాత్రలు పూర్తి స్థాయిలో ఉంటాయా లేక గెస్ట్ రోల్స్ వరకే పరిమితమా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో రూపొందే మల్టీస్టార్ చిత్రంలో రామ్చరణ్తో కలిసి ఎన్టీఆర్ నటించనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్లో ఈ సినిమా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. దీంతోపాటు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నారు. ఇక కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'ఎమ్మెల్యే' చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా, 'నా నువ్వే'లో తమన్నా హీరోయిన్గా మెరవనుంది. ఈ రెండు చిత్రాలు సమ్మర్ స్పెషల్గా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.