Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అందాల రాక్షసి'తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన లావణ్య త్రిపాఠి ఆ మ్యాజిక్ను రిపీట్ చేయటంలో గతేడాది నుంచి తడబడుతోంది. లావణ్య నటించిన 'మిస్టర్', 'రాధా', 'యుద్ధం శరణం', 'ఉన్నది ఒకటే జిందగీ', 'ఇంటెలిజెంట్' వంటి బ్యాక్ టు బ్యాక్ ఐదు చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక డిజాస్టర్స్గా నిలిచాయి. అలాగే వీటిల్లో లావణ్య పోషించిన పాత్రలు సైతం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. వరుస పరాజయాలతో ఉన్నప్పటికీ లావణ్యకు అవకాశాలు రావడం విశేషం. ఇందులో భాగంగా తాజాగా రవితేజ సరసన నటించే లక్కీఛాన్స్ను లావణ్య అందుకున్నట్టు తెలుస్తోంది. రవితేజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో, శ్రీనువైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని'లో నటిస్తున్నారు. తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. ఇందులో కథానాయికగా లావణ్యని ఎంపిక చేశారట. రవితేజ సరసన లావణ్య తొలిసారి నటిస్తున్న చిత్రమిది. రవితేజ దీంతో పాటు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చారట.