Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'డాక్యుమెంటరీ చిత్రాలు సమాజంలో మార్పును తీసుకురాగలవు' అని అంటున్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దిన్ షా. రాజ్కుమార్ హిరానీ, నందితా దాస్, రాహుల్ డోలాఖియాతో
కలిసి ఇండియన్ డాక్యుమెంటరీ ఫౌండేషన్ కార్యక్రమంలో నసీరుద్దిన్ షా పాల్గొన్నారు.
సమాజంలోని మార్పుకు డాక్యుమెంటరీల పాత్రపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, 'కొద్ది కాలంగా పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో కొన్ని మంచి డాక్యుమెంటరీలు చూడటం ప్రారంభించాను. అందులో చాలా వరకు సమాజంలోని సమస్యలను, సామాజిక అంశాలను ప్రతిబింబిస్తున్నాయి. వాటిని చూస్తే డాక్యుమెంటరీలతో సమాజంలో మార్పు తీసుకురావచ్చనే విషయం అర్థమైంది. థియేటర్లో సినిమాలను చూసే ప్రేక్షకులకు డాక్యుమెంటరీలు రీచ్ కావడం కష్టమనుకున్నాను. బోర్ కొడతాయనుకున్నా. కానీ ఓ అంతర్జాతీయ ఫెస్టివల్లో డాక్యుమెంటరీలను చూసినప్పుడు నా ఆలోచన తప్పని అర్థమైంది. ఆయా డాక్యుమెంటరీలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఉన్నాయి' అని చెప్పారు.