Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుసగా రెండు పీరియాడికల్ చిత్రాలు 'బాజీరావు మస్తానీ', 'పద్మావత్', ఒక హాలీవుడ్ యాక్షన్ చిత్రం 'త్రిబులెక్స్: రిటర్న్ ఆఫ్ గ్జెండర్ కేజ్'తో దీపికా పదుకొనె బాగా రెస్ట్ లెస్ అయిపోయిందట. దీంతో ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకుంటోంది. అయితే విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోవడంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా ఓ కారణమట. 'పద్మావత్' చిత్ర షూటింగ్ సమయంలో తీవ్రమైన నడుంనొప్పి, మెడనొప్పితో బాధపడిన దీపికను కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతోపాటు విటమిన్ డి3 లోపంతోనూ దీపికా బాధపడుతోందట. దీని కోసమై మెడిసిన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీపిక ఆరోగ్య సమస్యల కారణంగా విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో నటించాల్సిన ఓ సినిమా షూటింగ్ను కూడా వాయిదా వేశారట. ఇదిలా ఉంటే, మరో మూడు నెలల్లో రణ్వీర్ సింగ్, దీపికల వివాహం జరగబోతున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో దీపికా అనారోగ్యం ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.