Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఎమ్మెల్యే'. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై భరత్ రెడ్డి, కిరణ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం చిత్ర ట్రైలర్ విడుదలైంది. 'ఎంఎల్ఏగా గెలవాలంటే సినిమా డైలాగ్లు చెప్పడం, చిందులు వేయడం కాదు' అని కళ్యాణ్ రామ్ను ఉద్దేశించి విలన్ అనడం దానికి కౌంటర్గా 'నేనింకా రాజకీయం చేయడం మొదలు పెట్టలేదు. మొదలు పెడితే మీరు చేయడానికి ఏమీ మిగలదు' అని కళ్యాణ్రామ్ చెప్పే డైలాగ్, 'మా ఊళ్ళో నన్నందరూ మంచి లక్షణాలున్న అబ్బాయి అంటారు. దాన్నే షార్ట్ ఫామ్లో ఎంఎల్ఏ'తోపాటు 'మాట్లాడితే జనం జనం అంటున్నారు. మీ వెనుక ఒక్కరు కూడా లేరు' అనే ప్రశ్నకు సమాధానం 'వంద కూడా ఒక అంకెతో మొదలవుతుంది. నా జనం నా బ్యాక్ ఉండరు, నా బ్యాలెట్ బాక్సుల్లో ఉంటారు. చెట్టు ఎంతున్నా వేర్లు ఉండాల్సిందే భూమిలోనే, నదులెన్ని పరవళ్లు తొక్కినా కలవాల్సిందే సముద్రంలోనే వాడు నదైతే, నేను సముద్రం, వాడు చెట్టయితే నేను భూమి' అంటూ ఆవేశంగా చెప్పే శక్తివంతమైన డైలాగులు ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది.