Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రేమమ్' తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న నూతన చిత్రం 'సవ్యసాచి'. నిధి అగర్వాల్ కథానాయికగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, మోహన్(సీవీఎం) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, 'తన రెండు చేతులను సమర్థవంతంగా వినియోగించగల అర్జునుడిని 'సవ్యసాచి' అంటారు. టైటిల్కి తగ్గట్టుగానే సినిమా, నాగచైతన్య పాత్ర తీరుతెన్నులు ఉంటాయి. చైతూ మాస్ అప్పీల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మన దేశంలో చిత్రీకరణ పూర్తి అయ్యాక, అమెరికా వెళ్ళనున్నాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి జూన్ 14న సినిమాను విడుదల చేయనున్నాం. ఈ యాక్షన్ థ్రిల్లర్లో మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తుండటం ఓ విశేషమైతే, 'బాహుబలి' తర్వాత కీరవాణి సంగీతంతోపాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న చిత్రమిదే కావడం మరో విశేషం' అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, ఆర్ట్: రామకృష్ణ, ఎడిటర్: కోటిగిరి వెంకటేశ్వరరావు.