Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బయోపిక్ల జోరు బాలీవుడ్లో రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతోంది. ప్రముఖుల జీవితాలను తెరపై చూసేందుకు ప్రేక్షకులూ ఆసక్తి చూపుతుండటం, ఆయా చిత్రాలు కమర్షియల్గానూ బాగా వర్కౌట్ అవుతున్న నేపథ్యంలో బయోపిక్ చిత్రాల నిర్మాణం పెరగటం విశేషం. తాజాగా బాలీవుడ్లో మరో బయోపిక్ తెరపైకి రాబోతున్నట్టు సమాచారం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉద్దమ్ సింగ్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు దర్శకుడు సూజిత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నారట.
ఇందులో ఉద్దమ్ సింగ్ పాత్రలో రణబీర్ కపూర్ను నటించనున్నట్టు తెలుస్తోంది. 1919లో ఏప్రిల్ 13న అమృత్ సర్ స్వర్ణదేవాలయం సమీపంలో ఉన్న జలియన్ వాలా బాగ్ దురంతంలోని తోటలో 20వేల మంది స్వాతంత్ర సమరయోధులు సమావేశమయ్యారు.
ఆ విషయం తెలుసుకున్న పంజాబ్ జనరల్ డయ్యర్ వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో దాదాపు 3వేల మంది చనిపోయారు. ఈ ఘటనకు చలించిపోయిన ఉద్దమ్ సింగ్ 1940, మార్చి 13న డయ్యర్ను కాల్చి చంపేశాడు. దీంతో జూలై 31న ఉద్దమ్ను బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసింది.
సూజిత్ సర్కార్ ప్రస్తుతం 'అక్టోబర్' సినిమాను రూపొందిస్తున్నారు. ఇది ఏప్రిల్ 13న విడుదల కానుంది. రణ్బీర్ ప్రస్తుతం 'సంజు', 'బ్రహ్మాస్త్ర' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.