Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పరిశ్రమలో అండలేని వాళ్ళను ఆదుకునేందుకు 'మనంసైతం' లాంటి సంస్థను ప్రారంభించడం, వందలాది మందికి సహాయం అందించడం గొప్ప విషయం' అని తమన్నా అన్నారు. నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 'మనంసైతం' సంస్థ తయారు చేసిన టీ షర్ట్ను తమన్నా శనివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యక్రమాలను, కాదంబరి కిరణ్ను ఆమె అభినందించారు. 'మనం సైతం కార్యక్రమాల గురించి తెలుసుకున్నా. ఎంతో మంది పేదవాళ్లను ఆదుకుంటోంది. ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామి అవుతాను. ఇండిస్టీలో ఇరవై నాలుగు విభాగాల కార్మికులకు ఈ సంస్థ అండగా నిలవడం సంతోషంగా ఉంది. ఇదొక స్ఫూర్తిదాయక గొప్ప కార్యక్రమం' అని తమన్నా అన్నారు. 'మనంసైతం' కార్యక్రమాలను విస్తృతం చేయడమే మా ముందున్న లక్ష్యం. దీని వల్ల ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. తమన్నా వంటి స్టార్ హీరోయిన్ మా కార్యక్రమాలకు చేయూతనివ్వడం ఆనందంగా ఉంది. ఇందులో భాగస్వామినవుతాననడం ఎంతో బలాన్ని, శక్తినిచ్చింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మరికొంత మంది తమ చేయూతనిస్తారని ఆశిస్తున్నాం. ఈ సందర్బంగా మా సంస్థ ద్వారా తమన్నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా' అని కాదంబరి కిరణ్ తెలిపారు.