Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి సుశాంత్ హీరోగా 'చి.ల.సౌ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రుహాని శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి నిర్మిస్తున్నారు. నేడు(ఆదివారం) సుశాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని శనివారం చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, 'సుశాంత్ హీరోగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం కావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రామిసింగ్ చిత్రంగా రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మే 11న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.
వెన్నెల కిషోర్, రోహిణి, అనుహాసన్, రాహుల్ రామకృష్ణ, జయప్రకాష్, విద్యుల్లేఖ, సంజరు స్వరూప్, హరీష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం.సుకుమార్, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్.