Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉగాది పండుగని పురస్కరించుకుని కొత్త చిత్రాలను ప్రకటించి హీరోలు, దర్శకులు, నిర్మాతలు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. 'ఎంఎల్ఎ', 'నా నువ్వే' చిత్రాల్లో నటిస్తున్న కళ్యాణ్రామ్ నెక్ట్స్ 'మజ్ను' ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జెమినీ కిరణ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇటీవల 'తొలిప్రేమ'తో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ కూడా నూతన చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం 'ఘాజి' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్లో నటించేందుకు సిద్ధమవుతున్న ఆయన తదుపరి 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
గతేడాది 'హలో'తో కాస్త నిరాశ చెందిన అక్కినేని అఖిల్ నెక్ట్స్ 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ సినిమా ఈ నెల 26న పూజతో ప్రారంభమై, ఏప్రిల్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.