Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖకు ఉగాది పండుగని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'కళారత్న' పురస్కారాన్ని అందించింది. ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతిలో ఈ పురస్కారాన్ని స్వీకరించారు. 'ఈ పురస్కారం రావడం చాలా హ్యాపీగా ఉంది. నా సంగీత దర్శకత్వంలో మొదటి పాట రచన చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రికి కూడా ఇదే ఏడాది 'కళారత్న' పురస్కారం రావడం అదృష్టంగా భావిస్తున్నాను' అని శ్రీలేఖ అన్నారు. 12వ ఏట నుంచి సినిమాలకు సంగీత దర్శకత్వం అందించడం మొదలు పెట్టిన శ్రీలేఖ ఇప్పటి వరకు
5 భాషల్లో 75 సినిమాలకు సంగీతం సమకూర్చిన ఏకైక మహిళా సంగీత దర్శకురాలిగా
రికార్డు సృష్టించారు. దాసరి నారాయణరావు రూపొందించిన 'నాన్నగారు' సినిమాతో
సంగీత ప్రస్థానం మొదలై, మూవీ మొఘల్ రామానాయుడు నిర్మించిన 'తాజ్ మహల్', 'ధర్మచక్రం', 'ప్రేమించు' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించి మెలోడీ పాటలకు కేరాఫ్గా శ్రీలేఖ నిలిచారు.